ఉత్తర్వులు జారీ చేసిన పీసీబీ మెంబర్ సెక్రటరీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21(విజయక్రాంతి): పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పలువురు అధికారులను బదిలీ చేస్తూ పీసీ బీ మెంబర్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లా ఎన్వీరాన్మెంటల్ ఇంజనీర్గా పని చేస్తున్న సురేష్ బాబును హైదరా బాద్ రీజనల్ ఆఫీస్కు.. ఆయన స్థానంలో పీసీబీ హెడ్ ఆఫీసులో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా ఉన్న సంగీతను నల్గొండ రీజనల్ ఆఫీసు ఈఈగా బదిలీ చేశారు.
ఆర్సీ పురం రీజనల్ ఆఫీస్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా ఉన్న పద్మావతిని నిజామాబాద్.. హైదరాబాద్ రీజనల్ ఆపీసులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీ ర్గా ఉన్న సంగీత లక్ష్మిని కొత్తగూడెం, హైదరాబాద్ రీజనల్ ఆఫీసులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా ఉన్న ప్రీతి సుభాషిణిని నల్గొండకు బదిలీ చేశారు. కొత్తగూడెంలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా ఉన్న వెంకటేశంను హైదరాబాద్ జోనల్ ఆఫీసుకు.. హెడ్ ఆఫీసులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా ఉన్న భాగ్యలక్ష్మిని రామగుండం రీజనల్ ఆఫీసుకు బదిలీ చేశారు.
ఏఈఎస్ల బదిలీలు...
పీసీబీ కేంద్ర కార్యాలయంలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్గా ఉన్న పద్మను వరంగల్ జోనల్ లాబొరేటరీకి.. ఆర్సీపురం రీజనల్ ఆఫీసులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్గా ఉన్న అరుణను కొత్తగూడెం రీజనల్ ఆఫీసుకు, మేడ్చల్ రీజనల్ ఆఫీసులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ గా ఉన్న కరుణను నిజామాబాద్కు, ఆర్సీ పురం జోనల్ లాబొరేటరీలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్గా ఉన్న మృదుల సాహిత్యను నల్గొండ రీజనల్ ఆఫీసుకు బదిలీ చేశారు.
ఇక వరంగల్ జోనల్ లాబొరేటరీలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్గా ఉన్న నరసింహను పీసీబీ హెడ్ ఆఫీసుకు, కొత్తగూడెం రీజనల్ ఆఫీసులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్గా ఉన్న లింగయ్యను మేడ్చల్ రీజనల్ ఆఫీసుకు, నిజామాబాద్ రీజనల్ ఆఫీసులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్గా ఉన్న తిరుపతిని ఆర్సీ పురం జోనల్ లాబొరేటరీకి, నల్గొండ రీజనల్ ఆఫీసులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్గా ఉన్న పురుషోత్తం రెడ్డిని ఆర్సీపురం జోనల్ లాబొరేటరీకి బదిలీ చేస్తూ మెంబర్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.