calender_icon.png 23 October, 2024 | 3:21 AM

గుండు కొట్టించిన ఎస్సై బదిలీ

23-10-2024 12:39:21 AM

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఓ పెట్రోల్ బంక్ వద్ద జరిగిన చిన్నపాటి ఘర్షణలో ముగ్గురు యువకులను స్టేషన్‌కు తీసుకెళ్లి గుండు కొట్టించిన ఎస్సై జగన్‌పై బదిలీ వేటు పడింది. ఎస్సై చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని గుండు కొట్టించాడు. అందులోని ఓ యువకుడు మనస్థాపానికి గురై నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనకు సంబంధించి మొదట విజయక్రాంతి ఈ నెల 19న కథనాన్ని ప్రచురించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎస్సై వ్యవహార శైలిపై విమర్శలు రావడంతో జోగుళాంబ జోన్ డీఐజీ చౌహాన్ ఎస్సై జగన్‌ను వనపర్తి జిల్లా వీఆర్‌కు అటాచ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.