calender_icon.png 27 October, 2024 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బదిలీ.. డిప్యుటేషన్.. ఓడీ

06-08-2024 01:16:46 AM

  1. ఏది కావాలన్నా కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సిందే!
  2. ఇందుకు ప్రత్యేకంగా కమిటీని నియమించిన ప్రభుత్వం

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉపాధ్యాయులు, లెక్చరర్లు నిత్యం ఏదోక వ్యక్తి గత కారణాలు, ఇతర సమస్యలతో తమను బదిలీ చేయాలని, ఓడీ (ఆన్ డ్యూటీ) ఇవ్వాలని, వేరే చోటుకి డిప్యుటేషన్‌పై పంపించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతుంటారు.

మెడికల్, పర్సనల్, స్పౌజ్‌తోపాటు ఇతర కుటుం బ కారణాలను చూపుతూ ఈ మధ్యకాలంలో అధికారులకు భారీగా దరఖాస్తులు అందుతున్నాయి. ఇది పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఇక మీదట ఈ తరహా వచ్చే అర్జీలను ఈ కమిటీ పరిశీలించి నిర్ణ యం తీసుకుంటుంది.

మొత్తం ఐదుగురితో ప్రభుత్వం కమిటీని ఏర్పా టుచేసింది. ఈ కమిటీలో కళాశాల విద్యా కమిషనర్, సాంకేతిక విద్యా కమిషనర్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి, ఇంటర్ విద్యా డైరెక్టర్ సభ్యులుగా ఉండగా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. పైరవీలకు తావు లేకుండా సరైన కారణాలు చూపు తూ నేరుగా లేదా ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక వెబ్ పోర్టల్‌లో ఉపాధ్యాయులు, లెక్చరర్లు దరఖాస్తు చేసుకో వాలి.

ఏటా మే, ఆగస్టు, నవంబర్ నెల మొదటి వారంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా నెలల్లో మూడో వారంలో కమిటీ సమావేశమై వచ్చిన దరఖాస్తులపై నిర్ణయం తీసుకొని, అదే నెల 25లోపు సంబంధిత హెచ్‌వోడీలకు ఆదేశాలు జారీ చేస్తుంది. కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆయా శాఖల ఉన్నతా ధికా రులు బదిలీలు, ఓడీ, డిప్యుటేషన్‌కు చర్యలు తీసుకుంటారు.