10-02-2025 04:43:48 PM
నిర్మల్ (విజయక్రాంతి): విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే ఏకాగ్రత ధ్యానం ఎంతో అవసరమని ప్రిన్సిపల్ డేనియల్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ గురుకుల పాఠశాల ఇంటర్ విద్యార్థులు సోమవారం కాల్వ నరసింహస్వామి బాసర ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. రాబోయే పరీక్షల్లో బాగా మార్కులు సాధించాలని వారు సరస్వతి అమ్మవారిని మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.