16-04-2025 06:52:09 PM
కోదాడ: స్థానిక కిట్స్ మహిళ ఇంజనీరింగ్ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినులకు బిల్డింగ్ ప్లాన్ సాఫ్ట్వేర్ పై రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి గాంధీ తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు ట్రైనర్ గా వచ్చినటువంటి హేమంత్ కృష్ణ ప్రోగ్రామింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ ప్రోగ్రాం వలన విద్యార్థులకు బిల్డింగ్ ప్లానర్ గా ఉద్యోగ అవకాశాలకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున్ రావు, విభాగాధిపతి డాక్టర్ జనార్ధన్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.