10-02-2025 05:58:07 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూ ఆక్టివేట్ ప్లాన్ శిక్షణ తరగతులను జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు సోమవారం ప్రారంభించారు. తరగతి గదుల్లో విద్యా బోధనను మెరుగుపరిచేందుకు నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పర్మిషన్ అధికారులు నరసయ్య సిబ్బంది పాల్గొన్నారు.