calender_icon.png 21 September, 2024 | 11:01 AM

నిజామాబాద్ నుంచి ఢిల్లీకి రైలు..

21-09-2024 01:11:52 AM

కేంద్రమంత్రిని కోరిన ఎంపీ అరవింద్

నిజామాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): నిజామాబాద్ నుంచి ఢిల్లీకి రైలును నడపాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర రైల్వేమంత్రి అశ్వినివైష్ణవ్‌ను కోరారు. శుక్రవారం కేంద్రమంత్రిని న్యూఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యలపై చర్చించారు. ప్రస్తుతం వారానికి ఒక్కరోజు నిజామాబాద్ మీదుగా నడుస్తున్న కాజీపేట్ రైలును వారానికి మూడు సార్లు నడపాలని, ఆర్మూర్ బోధన్ కొత్త రైల్వే లైన్ల పనులను వేగవంతం చేయాలని కోరారు. నిజామాబాద్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణానికి అనుమతులివ్వాలని కేంద్రమంత్రిని కోరారు. నిజామాబాద్ నుంచి ముంబై, తిరుపతికి రైళ్ల సంఖ్యలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్ర మంత్రి కాజీపేట్ రైలు ట్రిప్పులను త్వరలో పెంచుతామని హామీ ఇచ్చారు.