హరారే : జింబాబ్వే రాజధాని హరారేలో రైల్వే క్రాసింగ్ వద్ద రైలు బస్సును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4:30 గంటలకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. "రైల్వే క్రాసింగ్ వద్ద బస్సు డ్రైవర్ ఆపకపోవడంతో 66 మంది ప్రయాణికులతో ఉన్న బస్సును రైలు ఢీకొట్టింది. ఆ తర్వాత, ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు గాయపడ్డారు" అని పోలీసులు తెలిపారు. మణికాలాండ్ ప్రావిన్స్లోని చిన్న పట్టణం రుసాపే వెలుపల మంటలు చెలరేగిన బస్సులో తొమ్మిది మంది ప్రయాణికులు మరణించిన వారం తర్వాత ఈ ప్రమాదం జరిగిందని ఓ వార్తా సంస్థ నివేదించింది. ప్రయాణీకుల రవాణా వాహనాలతో కూడిన రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాలు జింబాబ్వేలో సర్వసాధారణం, వాటిని తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది.