అనుమానాస్పద రీతిలో ముగ్గురు మృతి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): సనత్నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు బాత్రూమ్లో విగతజీవులుగా పడి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే ఆర్ వెంకటేశ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్లోని 204వ ఫ్లాట్లో నివాసం ఉంటున్నా డు. ఆదివారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ కనిపించలేదు.
బాత్రూమ్లో ఉన్నారేమోనని ఇంట్లో పని ముగించుకొని వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 3 గంటల సమయంలో వచ్చినపుడు కూడా ఎవరూ కనిపించలేదు. బాత్రూమ్ డోర్లాక్ అలాగే ఉండడంతో అనుమానం వచ్చి అపార్ట్మెంట్ నిర్వాహకులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని బాత్రూమ్ డోర్ పగులగొట్టి చూడగా వెంకటేశ్ (50), మాధవి (50)తో పాటు వారి కుమారుడు హరి (30) విగతజీవులుగా పడి ఉన్నారు. తొలుత విద్యుదా ఘాతంతో మృతిచెందినట్టు భావించినప్పటికీ, అలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా దవాఖానకు తరలించారు.