calender_icon.png 5 October, 2024 | 6:46 PM

రాజేంద్రప్రసాద్ కూతురు మృతిపట్ల ప్రముఖుల సంతాపం

05-10-2024 03:29:29 PM

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి (38) గుండెపోటుతో మరణించింది. చిన్న వయసులోనే కూతురు చనిపోవడంతో రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. కెపిహెచ్బి కాలనీ లోని రాజేంద్రప్రసాద్ నివాసం ఫార్చ్యూన్ విల్లా 226లో గాయత్రీ పార్థివదేహాన్ని సందర్శనకు తీసుకొచ్చారు. రాజేంద్రప్రసాద్ కూతురు మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఒక్కొక్కరుగా ఆయన నివాసానికి వచ్చి పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.