calender_icon.png 15 October, 2024 | 4:59 AM

నిమజ్జనోత్సవంలో విషాదం

15-10-2024 12:19:56 AM

పెనుగంగా నదిలో ఒకరు గల్లంతు

ఆదిలాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాం తి): దుర్గాదేవి విగ్రహ నిమజ్జనోత్సవంలో వి షాదం నెలకొంది. విగ్రహాన్ని నిమజ్జనం చే స్తున్న క్రమంలో ఓ వ్యక్తి పెన్‌గంగా నదిలో గల్లంతైన ఘటన ఆదిలాబాద్‌లో చోటుచేసుకుంది.

ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవే న గర్ కాలనీకి చెందిన గజ్జు(35) సోమవారం దుర్గామాత విగ్రహ నిమజ్జనానికి జైనథ్ మ ండలంలోని డోలారా వద్దగల పెన్‌గంగా న దికి వెళ్లాడు. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నదిలో పడి గల్ల ంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.