ఎమ్మెల్యే సుధీర్రెడ్డికి వినతి
ఎల్బీనగర్, జూలై 7: వనస్థలిపురం తూర్పులో భాగంలోని 22 కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వివిధ కాలనీ సంఘాల నాయకులు ఆదివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వనస్థలిపురం పరిధిలోని సంపూర్ణ టాకీస్, రైతుబజార్ దగ్గర వెలిసిన దుకాణాలతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయన్నారు. దీంతో, ఇంటికి వెళ్లడానికి గంటల సమయం పడుతుందని ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్మే మాట్లాడుతూ.. రైతుబజార్, సంపూర్ణ టాకీస్ వద్ద ఉన్న చిరు వ్యాపారులతో మాట్లాడి, వారిని ఇతర ప్రాంతాలకు వెళ్లే విధంగా చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సుష్మ రోడ్డులో ట్రాఫిక్ సమస్యల రాకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు.