19-03-2025 04:48:02 PM
రాజేంద్రనగర్: ఆటో ఢీకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయిన సంఘటన నార్సింగిలో జరిగింది. నార్సింగి నుంచి గచ్చిబౌలికి విధులకు వెళ్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ను ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలయ్యాయి. అతడి ఎడమ కాలు విరిగింది. పారిపోతున్న ఆటోవాలాను స్థానికులు పట్టుకున్నారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.