హైదరాబాద్: పాతబస్తీలోని కాలాపత్తర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో ఓ వ్యాపారి బహిరంగంగా హత్యకు గురయ్యాడు. సమద్ బిన్ షిమ్లాన్ (40) తన స్నేహితుడు ఖలీద్తో కలిసి ఉండగా కొందరు వ్యక్తులు వారిని వెంబడించి విచక్షణారహితంగా దాడి చేయడంతో సమద్కు తీవ్ర గాయాలయ్యాయి. కత్తులు, కటార్లతో రక్తస్రావం కావడంతో సమద్ బిన్ షిమ్లాన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు షాహలిబండ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. గాయపడిన ఖలీద్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.