రాజంపేట (విజయక్రాంతి): రాజంపేట మండలం నుండి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ట్రాక్టర్ లో ఇసుకను లేత మామిడి తాండాలో నుంచి వేరే గ్రామాలకు సరఫరా చేస్తున్నారని సమాచారంపై రాజంపేట పోలీస్ సిబ్బంది తెల్లవారుజామున నడిమి తండాకు చెందిన వ్యక్తిని, ఇసుకతో ఉన్న ట్రాక్టర్ నీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ట్రాక్టర్ నీ సీజ్ చేశారని రాజంపేట ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. పాల్గొన్న పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్స్ సురేష్ చరణ్ లను ఎస్ఐ పుష్పరాజ్ అభినందించారు.