calender_icon.png 27 October, 2024 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

27-10-2024 11:18:26 AM

మంథని గోదావరి, మానేరు నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత 

మంథని ఎస్ఐ డేగ రమేష్ 

మంథని (విజయక్రాంతి): మండలంలోని గోదావరి, మానేరు నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను శనివారం రాత్రి పట్టుకున్నట్లు మంథని ఎస్ఐ డేగ రమేష్ తెలిపారు.  మండలంలోని విలోచవరం గ్రామానికి చెందిన కోరవేణి శ్యాంసుందర్ గోదావరి నది నుండి అక్రమంగా తన ట్రాక్టర్ తో ఇసుకను తరలిస్తుండగా, చిన్న ఓదల గ్రామానికి చెందిన మోతుకు రాజబాబు మానేరు నుండి ఇసుకను తన ట్రాక్టర్ తో అక్రమంగా తరలిస్తున్నారని సమాచారంతో తమ సిబ్బంది వారి టాక్టర్లను పట్టుకున్నారని తెలిపారు. వాటిపై కేసు నమోదు చేశామని, మంథని మండలంలో అక్రమ ఇసుక తరలించేవారు పద్ధతి మార్చుకోవాలని, ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ రమేష్ హెచ్చరించారు.