calender_icon.png 9 March, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్లంతైన కార్మికుల ఆనవాళ్లు గుర్తించిన కేరళ జలాలు

09-03-2025 09:35:41 AM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో గల్లంతైన కార్మికులు, ఇంజినీర్ల వారిని గుర్తించడంలో సాహాయక బృందాలు కొంత పురోగతి సాధించాయి. టన్నెల్ లోని 14వ కిలో మీటర్ వద్ద ప్రమాదం జరిగిన ఎనిమిది మంది గల్లంతైన వారి ఆనవాళ్లు 100 మీటర్ల దూరంలో లభించినట్లు సమాచారం. డి-2 అనే పాయింట్ లో కేరళ జాగిలాలు ఆనవాళ్లు గుర్తించిన ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టి తొలగిస్తున్నారు.

గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉందని వెల్లడించిన అధికారులు గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్లు అధికారికంగా ధ్రువీకరించాలేదు.  ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న వారి మృతదేహాలను గుర్తించేందుకు కేరళ నుంచి తీసుకొచ్చిన క్యాడవర్‌ డాగ్స్‌ ఇప్పుడు పోలీస్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇతర రాష్ర్టాలు, నిఘా సంస్థలకు కూడా జాగిలాలకు శిక్షణ ఇచ్చి పంపిస్తున్న తెలంగాణలో.. అటువంటి డాగ్స్‌ లేకపోవడం చర్చనీయాంశమైంది.