calender_icon.png 4 October, 2024 | 6:37 PM

రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యం

04-10-2024 03:18:29 PM

టీజీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

కామారెడ్డి,(విజయక్రాంతి): దేశ దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చేయడమే తమ లక్షమని టిజిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. టీజీపీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైనా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ వెళ్తుండగా కామారెడ్డి జిల్లా టోల్ ప్లాజా వద్ద కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% శాతం ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ కు చెందిన వారి గెలుపు పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వైపు ప్రజలు మో గ్గుచూపుతున్నారని రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ నే అని అన్నారు. ప్రధాని మోడీ పట్ల ప్రజలకు విశ్వాసం పోయిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత పది సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ప్రజల కు మేలు చేయకుండా కేవలం వారి కుటుంబ సభ్యులు కొంత మంది టిఆర్ఎస్ నాయకులు లబ్ధి పొందారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ... రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో కాంగ్రెస్ చెందిన సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసిలు పొందుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ,మాజీ ప్రభుత్వ విప్ సయ్యద్ యూసుఫ్ అలీ, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి, మద్ది మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకుడు ఎడ్ల రాజిరెడ్డి లోయపల్లి నర్సింగరావు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కౌన్సిలర్ మండల నాయకులు పాల్గొన్నారు.