తిరుమల,(విజయక్రాంతి): తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య సమాయంలో మహేష్ కుమర్ గౌడ్ కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.