calender_icon.png 17 October, 2024 | 6:00 PM

గ్రూప్-1పై ఒక నిర్ణయం తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్

17-10-2024 03:32:08 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గాంధీభవన్ లో గ్రూప్-1 అభ్యర్థులతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. గ్రూప్-1 అభ్యర్థుల సమస్యలను మహేష్ కుమార్ గౌడ్  అడిగి తెలుసుకున్నారు. గ్రూప్-1 పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని, లేకపోతే జీవో 29 వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని, జీవో 55 అమలు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనిపై సానుకులంగా స్వధించిన టీపీసీసీ చీఫ్  సాయంత్రంలోపు గ్రూప్-1పై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అభ్యర్థుల సమాస్యలపై అధికారులతో మాట్లాడుతామని, అభ్యర్థులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత తమదని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. అటు గాంధీ భవన్ వద్ద అరెస్ట్ చేసిన గ్రూప్-1 అభ్యర్థులని వెంటనే విడుదల చేయాలని మహేష్ కుమార్ గౌడ్ సీఐని కోరారు. కాగా, గ్రూప్-1 అభ్యర్థులు గురువారం ఉదయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు.