ప్రముఖ మలయాళ నటుడు టీపీ మాధవన్ (88) కన్నుమూశారు. కొంత కాలంగా వృద్ధాప్యం కారణంగా ఆయన పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే ఆయన చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. మాధవన్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్, పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలిపారు.