calender_icon.png 16 March, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో టోర్నడోల బీభత్సం

16-03-2025 01:22:45 AM

  • దాదాపు 19 మంది మృతి
  • పలు రాష్ట్రాల్లో హెచ్చరికలు జారీ

వాషింగ్టన్, మార్చి 15: అగ్రరాజ్యాన్ని టోర్నడోలు వణికించాయి. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. ఈ టోర్నడోల ధాటికి దాదాపు 19 మంది మరణించినట్లు తెలుస్తోంది. అనేక మంది గాయ పడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఒక్క ముస్సోరి రాష్ట్రంలోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు పేర్కొన్నారు.

3 లక్షలకు పైగా జనాలు అంధకారంలో మగ్గుతున్నారు. ఇక అర్కాన్స్ జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడగా.. 29 మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. 138 మిలియన్ల మంది ఈ వాతా వరణం వల్ల ప్రభావితం అవుతున్నారు. ఇల్లియన్స్, మిస్సౌరి, అర్కాన్స్, మిస్సిసిపి, ఇండియానా రాష్ట్రాల్లో టోర్నడోల వీచే సూచనలు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశారు.