20-03-2025 08:15:30 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కవిత్వమే అతని ప్రాణం ఊపిరి, కవి గాంచని చోట రవిగాంచును అనే నానుడి ప్రాచుర్యంలో ఉంది. కవి అంటే కనిపించేవే కాదు వినిపుంచేవే కాదు. కవి కళ్ళతో చూడగలడు హృదయం చూడగలరు. ప్రపంచ కవిత దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్ వైద్య ఉమశేషారావు అదే కోవలోకి వస్తారు. ఆయన చదివింది రాజనీతి శాస్త్రం బోధించేది రాజనీతి శాస్త్రం అయినప్పటికీ నిత్యం సామాజిక అంశాలపై కవితలు రాయడం, కవిత రాయని రోజు లేకుండా ప్రతిరోజు ఏదో అంశంపై వచన కవితలు రాయడం ఊపిరిగా సాగుతున్నారు.
కళాశాల స్థాయి నుండి ప్రారంభం అయిన ఈ ఆసక్తి అనురక్తిగా మరి చినుకు చినుకు నీళ్లుగా మరి కవిత్వం ఊపిరిగా మరి జీవిత చారమాంకం వరకు కొనసాగుతుంది. అతని విశ్వాసం కవిలో కనిపించింది.. లాక్ డౌన్ లో కూడా కరోనాపై చైతన్యం కల్పిస్తూ కవితలు రాసారు. అక్షరాలు అస్త్రాలుగా చేసుకొని మార్పు తపన పడుతూ షీ టీం, స్పందన, ఎన్నికల ముచ్చట్లు, వయోజన విద్యాపై నాటికలు రాసారు. తెలుగు వెలుగు, ప్రతి వాట్సాప్ గ్రూప్ లోను, ముఖ చిత్రంలోను నిరంతరము కవితలు రాయడం ఒక వృత్తిగా మార్చుకున్నారు. పర్యావరణం, నీటి ప్రాముఖ్యత, అక్షరాస్యత, ఇంకుడుగుంతలు, హరితహారం, స్త్రీల సమస్యలపై కవితలు, ఉక్రెయిన్ యుద్ధం, మానవ హక్కులు ప్రతి అంశంపై కవితలు రాస్తూనే ఉన్నారు.
కలంతో నేస్తం చేయడమే కాకుండా జీవితభాగస్వామిని సాహిత్యంలో ప్రోత్సహిస్తూనే ఉన్నారు. 200 పై చిలుకు ప్రశంసా పత్రాలు సన్మానాలు, అవార్డులు పొందారు. తెలంగాణ జాగృతి నిర్వహించిన కవితల పోటీల్లో, హితసాహితి, జాతీయ సాహిత్య పరిషద్, తెరవే, తెరసం, మంజీర కళాపీఠం, ఉట్నూరు సాహితి వేదిక దర్పణం వంటి అనేక సాహితి సంస్థల సమూహాల్లో సభ్యుడు ఆ సంస్థల కార్యనిర్వహణలో పాల్గొంటూ కవితలు రాస్తున్నారు. నా తెలంగాణ తెలుగు అనే అంశంపై తన అవ్వ బాషా అయ్యా బాషాపై ప్రేమను ఉద్వేగాన్ని వ్యక్తం చేసారు. హితన్ని కోరేవాడే కవి సమాజ హితం కోసం తన ఆరాటం, ఉబలాటం శ్రీ శ్రీ అన్నట్టు కవితకు ఏది అనర్హం కాదన్నట్లు ప్రత్యేక అంశాలపై కవితాత్మకంగా స్పందించే తత్వం కవి సహజ లక్షణం. ప్రపంచ తెలుగు మహాసభలు పాల్గొనడం నుంచి కవిత ఒక పిచ్చిగా ఎక్కడ సాహిత్య సమావేశాలు జరిగిన వాలిపోవడం జరిగింది.
బిసుర కవుల వనం ద్వారా ప్రపంచ కవిత దినోత్సవం పురస్కరించుకొని రాసిన కవితలు,హోళీ సందర్బంగా రాసిన కవితల్లో విజేతలుగా నిలిచారు. ఆయన మాటల్లో కవి ఆంటే కవి నిపించేవి వినిపించేవే కాదు.. కనిపించని వినిపించని వాటిని తన హృదయంతో చూడగలడు. ఒక లక్ష్యం కోసం కలంతో సమాజ క్షేత్రంలో ప్రజా పక్షమే అతని నైజాం భయం లేదు భావన తప్ప అక్షరాలు పిరంగులుగా అక్రమాలపై పేల్చగలడు హృదయ తన్మయత్వంలో తనకు తానే సాటి అచ్చు అయిన కవిత చూసి జీవితంలో ఏదో పొందిన అనుభూతి ఎండల్లో వానవానల్లో ఎండ ఎడారిలో మంచుగుండెలను పిండి చేయగలడు. హాస్యంతో అయుష్షు పోయాగలడు. దేశ నిర్మాణంలో అయిన పునాదీసృజనలో మేటిమాటలో వాగ్ధాటి ఆయన కులం అక్షారం ఆయన ప్రాణం మానవత్వం సమసమాజమే హితం కొందరి దృష్టిలో అది పిచ్చికానీ అతనికి అంతరనుభూతి కవి కలంతో వికాసం కోసం ఆరాట పడే హృది అగ్గిపుల్ల నుంచి ఆకాశం వరకు గల్లీ నుంచి విశ్వం వరకు అన్నింటి నుంచి కవిత వస్తువును ఎంపిక చేసుకొనే దిట్టకళ ఏది అయిన ప్రజాపక్షమే అయి ఉండాలి.