తెలుగు సినిమాను టెక్నికల్గా టాప్ రేంజ్కు చేర్చిన ఘనత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళిదే. సినిమాల్లో భారీ స్థాయి లో గ్రాఫిక్స్ను వాడటం మొదలు పెట్టిందీ ఆయనే. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏఐ గురించి ఆయన శిక్షణ తీసుకోవడం ద్వారా ఏదో మ్యాజిక్ చేయబోతున్నారా? అంటే ఔననే అంటున్నారు సినీ జనాలు. మహేశ్బాబు హీరోగా రాజమౌళి ఓ చిత్రం తెరకె క్కించనున్న విషయం తెలిసిందే.
వర్కింగ్ టైటిల్ ‘ఎస్ఎస్ఎంబీ29’తో ప్రచారంలో ఉన్న ఈ మూవీని పట్టాలెక్కించడానికి ముందే మరింత అప్డేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట రాజమౌళి. ఈ మూవీ ఇంకా పట్టాలెక్కలేదు.. పూర్వ నిర్మాణ పనుల్లోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ ట్రైనింగ్ తీసుకునేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారట. ప్రస్తుతం సినిమాల్లో గ్రాఫిక్స్ వినియోగం భారీగా పెరిగింది.
కొన్ని సినిమాల్లో చనిపోయిన ఆరిస్టులను కూడా తెర మీద చూపిస్తున్నారు. రాజమౌళిదీ ఆ ప్రయత్నమేనా? అని చర్చించుకుంటున్నారు. గతంలో ‘యమదొంగ’లో సీనియర్ ఎన్టీఆర్ను తెర మీద చూపించిన రాజమౌళి.. ఈ సారి మహేశ్బాబు, సూపర్ స్టార్ కృష్ణను ఒకే ఫ్రేమ్లో చూపించే ప్రయత్నమేమైనా చేస్తున్నారని అంతా చెప్పుకొంటున్నారు.
ప్రస్తుతం మహేశ్తో చేయనున్న ‘ఎస్ఎస్ఎంబీ29’ అడ్వంచరస్ యాక్షన్ డ్రామానే కాబట్టి గతంలో కృష్ణ చేసిన ‘మొసగాళ్లకు మోసగాడు’ లాంటి సినిమాల్లోని పాత్రలను మళ్లీ రీ క్రియేట్ చేసే అవకాశం లేకపోలేదన్న టాక్ ఇండస్ట్రీ సర్కిళ్లలో బాగా వినవ స్తోంది. మరి ఈ విషయంలో రాజమౌళి ఏం చేస్తున్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచిచూడాల్సిందే.