హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర బీజేపీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారా యణను నియమించారు. శనివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొత్త పదవీ బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఆయన కీలకమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మండల, జిల్లాల అధ్యక్షుల ఎన్నికలతో పాటు పార్టీలో కీలకమైన పదవుల ఎంపికకు సం బంధించిన వ్యవహారాలను యెం డల పర్యవేక్షించనున్నారు. సహ రిటర్నింగ్ అధికారులుగా జీ కరుణాకర్, గీతామూర్తి, బీ ఉమాశంకర్ నియమి తులయ్యారు. రిటర్నింగ్ అధికా రిగా బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా యెండలకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. పార్టీ నాయకులు బీ ఉమాశంకర్, కేవీఎస్ఎన్ రాజు, మురళీధర్ రెడ్డి ఉన్నారు.