calender_icon.png 30 March, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

27-03-2025 08:38:47 AM

తిరుమలపవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు గురువారం వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టు మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి ఏటీసీ క్యూలైన్ వరకు భక్తులు వేచిఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,354 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,510 మంది భక్తులు నిన్న వెంకన్నకు తల నీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.