13-04-2025 08:50:24 AM
తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్వనానికి(Srivari Sarva Darshan ) 20 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం కోసం భక్తులు కంపార్టుమెంట్లు నిండి ఎంబీసీ క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. నిన్న 72,923 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 35,571 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శనివారం తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం(Srivari Hundi Income) రూ. 3.33 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వరస సెలవు దినాలు రావడంతో వెంకన్న భక్తులు భారీ సంఖ్యలో తిరుమల కొండకు చేరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.