10-04-2025 08:04:36 AM
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు గురువారం ప్రకటించారు. తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి(Sarvadarshanam) 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 62,076 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న 23,699 మంది భక్తులు తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.