15-03-2025 08:29:49 AM
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరస సెలవులు కావడంతో తిరుమల కొండకు భక్తుల తాకిడి పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. 63,987 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 26,880 మంది భక్తులు వెంకన్నకు తలనీలాలు సమర్పించగా, రూ. 2.88 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.