calender_icon.png 20 March, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

20-03-2025 08:33:12 AM

అమరావతి: తిరుమల తిరుపతి దైవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం(Srivari darshan timings) పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న తిరుమల వెంకన్నను 72,388 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,145 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం(Srivari Hundi Income) రూ. 3.97 కోట్లు వచ్చినట్లు టీటీడీ గురువారం ప్రకటించింది. అటు తిరుమల తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతుంది. నేడు కమిషన్ CVSO శ్రీధర్‌ను విచారించనుంది. 21 నుంచి 3 రోజుల పాటు 42 మంది విజిలెన్స్‌ సిబ్బందిని, 32 మంది పోలీసులను కమిషన్‌ విచారించనున్నట్లు సమాచారం.