calender_icon.png 11 March, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

11-03-2025 08:09:29 AM

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వ దర్శనానికి(Tirumala Venkateswara Temple) 13  కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,746 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,649 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, రూ.4.27 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానంప్రకటించింది. ఎండలు బాగా కొడుతుండడంతో కాలినడకన శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.