10-03-2025 08:20:38 AM
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) లోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం(Srivari Sarvadarshan) పడుతోందని టీటీడీ ప్రకటించింది. శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 79,478 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం శ్రీవారికి 26,667 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.