ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు కాలినడకన కొండపైకి
హైదరాబాద్, అక్టోబర్ 1(విజయక్రాంతి): ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం అలిపిరి పాదా ల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడక తిరుమలకు వెళ్లారు. పవన్ రాకతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్షను విరమించనున్నారు. అనంతరం అన్న ప్రసాద కేంద్రాని పరిశీలిస్తారు. దీక్ష విరమణ నేపథ్యంలో రాష్టంలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించారు. బుధవారం ఓం నమో నారాయణాయ మంత్రం ఆలయాలు, యోగ కేంద్రాల్లో పఠించాలని పార్టీ శ్రేణులకు జనసేన అధిష్ఠానం సూచించింది. 3వ తేదీన ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేయాలని ఆయన పేర్కొన్నారు.