బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో సోమవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు స్కూటీ ర్యాలీ నిర్వహించాలని, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం ఆమె ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. స్వాతం త్య్ర దినోత్సవం నేపథ్యంలో హర్ ఘర్ తిరంగా పేరుతో కార్యక్రమాలను నిర్వహించాలని మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ పిలుపునిచ్చారని శిల్పారెడ్డి చెప్పారు. ఆ పిలుపులో భాగంగా తాము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.