calender_icon.png 19 April, 2025 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతీయులకు దక్కని చోటు

17-04-2025 11:40:57 PM

టైమ్స్ అత్యంత ప్రభావశీలుర జాబితా విడుదల

ట్రంప్, ఎలాన్ మస్క్, మహ్మద్ యూనస్‌లకు చోటు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితా ప్రతిష్ఠాత్మక టైమ్ మ్యాగజైన్ గురువారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఈసారి భారత్‌కు చెందిన ఒక్కరికి కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులకు చోటు దక్కింది. 2025 టైమ్ మ్యాగజైన్.. రాజకీయాలు, సైన్స్, వ్యాపారం, వినోదం ఇలా పలు కేటగిరీల నుంచి 100 మంది అత్యంత ప్రభావవంతులైన వ్యక్తులను ఎంపిక చేసింది. ట్రంప్‌తో పాటు యూకే ప్రధాని కీర్ స్టార్మర్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్, యూఎన్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్, డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ వంటి ప్రముఖులకు చోటు దక్కడం విశేషం. జాబితాలో జిమ్నాస్ట్ దిగ్గజం సిమోన్ బైల్స్, పాపులర్ సింగర్ ఈద్ షరీన్, ఏఐ దిగ్గజం డెమిస్ హిస్సాబిస్‌ల పేర్లు కూడా ఉన్నాయి. అయితే గతేడాది ప్రకటించిన జాబితాలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, బాలీవుడ్ నటి ఆలియా భట్, ఒలింపియన్ రెజ్లర్ సాక్షి మాలిక్, నటుడు దేవ్ పటేల్ తదితరులు చోటు దక్కించుకున్నారు.