సుగి విజయ్, జుప్సీ భద్ర హీరోహీరోయిన్గా పరమేశ్ రేణుకుంట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఐ హేట్ మ్యా రేజ్’. ఆర్య సినిమా పతాకంపై ఎం దయానంద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత శ్రీనివాస రాజు క్లాప్నివ్వగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ సోదరుడు, రచయిత, నిర్మాత విజయ్కుమార్ కెమెరా స్వీచ్ ఆన్ చేశారు.
సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ యువతరంతోపాటు కుటుంబ ప్రేక్షకులు మెచ్చే భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని చెప్పారు.
చిత్రీకరణ కూడా సోమవారం నుంచే ప్రారంభించామని నిర్మాత తెలిపారు. ఏకధాటిగా డిసెంబర్ వరకు జరగే షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుందని చెప్పారు. ఈ చిత్రానికి డీవోపీ: విజయ్ సి కుమార్; సంగీతం: వరికుప్పల యాదగిరి, అడిషినల్ డైలాగ్స్: శ్రీనివాస్ తేజ.