14-02-2025 12:00:00 AM
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
వేములవాడ, ఫిబ్రవరి 13: మహా శివరా త్రి జాతర పురస్కరించుకొని వచ్చే భక్తులకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువారం వేములవాడ రాజ న్న ఆలయంలో మహా శివరాత్రి జాతర సం దర్భంగా ప్రధాన ఆలయ ప్రాంగణంలో, పా ర్కింగ్ ప్రదేశాల్లో, ఆలయంలోకి వచ్చి వెళ్లే దారులు, క్యూ లైన్లలో, కళ్యాణ కట్ట, ధర్మ గుండం, ఆలయ ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను పోలీస్ , ఆలయ అధికారులతో కలసి పరిశీలించి పలు సూచనలు, సలహా లు చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లా డుతూ ఈ నెల 25 నుంచి 27వ వరకు నిర్వ హించనున్న మహా శివరాత్రి జాతర వేడుక లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుం డా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పకడ్బందీగా జాతర ఏర్పాట్లను నిర్వహించా లని అధికారులను ఆదేశించారు. గతంతో పోల్చుకుంటే ఈ జాతరకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున్నారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారి వాహనాల పార్కింగ్ నిమిత్తం గత ఏడాది కంటే ఎక్కువ పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రదేశాల్లో విధులలో ఉన్న సిబ్బం దికి టెంట్ మంచి నీటి సదుపాయలు కలి గించాలన్నారు, పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ డ్రైవర్షన్ల వద్ద సూచిక బోర్డ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయా లన్నారు.మహా శివరాత్రి జాతర పురస్కరిం చుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన లు జరగకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రధాన అలయంతో పాటుగా అనుబంధ దేవాలయాల వద్ద, పా ర్కింగ్ ప్రదేశాల వద్ద,శివార్చన ప్రదేశంలో, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, స్పెషల్ బ్రాం డిఎస్పీ మురళి కృష్ణ, సి.ఐ లు వీర ప్రసాద్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాం సి.ఐ శ్రీని వాస్,మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఆలయ ఈ. ఓ వినోద్, ఆలయ ఈ. ఈ రాజేష్, డి. ఈ మహిపాల్ రెడ్డి,ఏఈఓ శ్రవణ్ కుమార్, ఏఈ రామ్ కిషన్ రావు, ఎస్.ఐ లు ప్రేమ నందం, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.