calender_icon.png 26 October, 2024 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారంగపూర్‌లో పులి సంచారం

26-10-2024 01:04:22 AM

ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

నిర్మల్ , అక్టోబర్ 25 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం సయ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న గిరిజన గూడాల పరిసర ప్రాంతా ల్లో గురువారం చిరుతపులి కనిపించడంతో తండావాసులను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. రవీంద్రనగర్ అటవీ ప్రాంతంలో మేకలకు మేత మేపడానికి వెళ్లిన సాయికి గురువారం పులి కనిపించింది.

కేకలు వేయ డంతో పులి తనని వెంబడించిదని పరుగుతో చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడు కున్నట్టు సాయి గ్రామస్తులకు తెలి పారు. అయితే మేకల మందలోని రెం డు మేకలను పులి ఎత్తుకుపోయినట్టు కాపరి తెలిపాడు. సమాచారాన్ని తం డావాసులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.