ఉప్పల్ వేదికగా భారత్, బంగ్లా మూడో టీ20
హైదరాబాద్: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగనున్న చివరి టీ20 మ్యాచ్కు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఈ నెల 12న జరగనున్న మూడో టీ20 మ్యాచ్కు సంబంధించిన టికెట్లను నేటి నుంచి విక్రయించనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ తెలిపారు.
శనివారం మధ్యాహ్నం 12.30 నుంచి పేటీఎం ఇన్సైడర్ వెబ్సైట్ లేదా యాప్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. టికెట్ల ప్రారంభ ధర రూ. 750 నుంచి ఉంటాయని తెలిపారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్లను ఈ నెల 8 నుంచి 12 వరకు జింఖానా స్టేడియంలో రిడెంప్షన్ చేసుకోవాలని కోరారు. ఆఫ్లైన్లో టికెట్లు విక్రయించడం లేదని స్పష్టం చేశారు.