దుబాయ్: మహిళల టీ20 ప్రపంచకప్ టికెట్ల విక్రయాలు ప్రారంభమ య్యాయి. ఐసీసీ ముందుగా పేర్కొన్న విధంగా 18 సంవత్సరాల లోపు వారి కి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. అయితే గతానికి భిన్నంగా చాలా తక్కువ ధరకు 5 దిర్హమ్స్ (దాదాపు రూ. 114)కే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మెగా టోర్నీ ప్రారంభం అయ్యేందుకు మరో వారం రోజులే ఉండడంతో ఇప్పటికే అన్ని జట్లు యూఏఈలో అడుగుపెట్టాయి. ప్రీమి యం సీట్లు 40 దిర్హామ్స్ (రూ. 910)గా నిర్ణయించారు.