calender_icon.png 15 October, 2024 | 4:55 AM

దసరాకు టికెట్ రేట్లు పెంచలేదు..

15-10-2024 02:47:26 AM

‘ఎక్స్’ దార్వా వెల్లడించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ చార్జీలు పెంచిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ.. అది నిజం కాదని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. పండుగ వేళ అయినప్పటికీ ఒక్కపైసా కూడా ఛార్జీలు పెంచలేదని తేల్చిచెప్పారు.ఆ దుష్ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

జీవో ప్రకారం స్పెషల్ బస్సుల్లో మాత్రమే చార్జీలు పెంచామన్నారు. రెగ్యులర్ సర్వీసుల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. స్పెషల్ బస్సులు ఒక్కసారి ప్రయాణికులను దించి తిరిగి వస్తాయని, కొన్నిసార్లు వాటిలో ప్రయాణికులు ఉండరన్నారు. కేవలం డీజిల్ ఖర్చుల కోసమే స్పెషల్ సర్వీసులకు  జీవో ప్రకారం చార్జీ పెంచామన్నారు