calender_icon.png 17 October, 2024 | 1:50 PM

సబ్ స్టేషన్ పై పిడుగు..

17-10-2024 11:58:01 AM

కరీంనగర్, (విజయక్రాంతి): కరీంనగర్ సమీపంలోని పద్మనగర్ విద్యుత్ స్టేషన్ పై గురువారం తెల్లవారుజామున అయిదు గంటల సమీపంలో పిడుగు పడింది. ఉరుములు మెరుపులతో బారి వర్షం కురిసింది. అగ్నిమాపక కేంద్రానికి స్థానికులు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని సబ్ స్టేషన్ లో మంటలు అదుపులోకి వచ్చాయి. పిడుగు పడటంతో సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్కో ఎస్ ఈ శ్రీనివాస్ సబ్ స్టేషన్ సందర్శించి పరిశీలించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి.