calender_icon.png 16 October, 2024 | 5:53 PM

అంబేద్కర్ కు మీసాలు పెట్టిన దుండగులు

16-10-2024 11:13:35 AM

యాచారం: యాచారం మండల పరిధి మాల్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు మీసాలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి జరిగి ఉంటుందని తెలుస్తుంది. దీంతో అంబేద్కర్ సంఘాల నేతలు, దళిత సంఘాలు, అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారు మాట్లాడుతూ... అంబేద్కర్ గ్రహానికి మీసాలు పెట్టిన దుండగులను వెంటనే పట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.