ఖమ్మం, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఖమ్మం నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కల్పిత వార్తను తయా రు చేసి యజమాన్యాన్ని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు యూట్యూబర్స్ను ఖమ్మం వన్ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఏటా రూ.5 లక్షలు యాడ్ రూపంలో చెల్లించకపోతే తమ యూట్యూబ్ ఛానల్లో ఆసుపత్రికి వ్యతిరేకంగా న్యూస్ అప్లోడ్ చేస్తామని బెదిరించారు.
యాజమాన్యం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో యూట్యూబ్ చానల్ సీఈవో పుచ్చకాయల ప్రకాశ్, బ్యూరో చీఫ్ అత్తు లూరి రామకృష్ణ, అసిస్టెంట్ కెమెరామెన్ షేక్ బాబాను అరెస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడితే చర్యలు త ప్పవని పోలీసులు హెచ్చరించారు.