నిర్మల్ జిల్లాలో ఇద్దరు..
నిర్మల్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆదివారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. నిర్మల్ జిల్లాలోని దిలువార్పూర్కు చెందిన మీసాల చిన్న భీమన్న(40) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఉదయం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భైంసా మండ లంలోని పాంగ్రా గ్రామానికి చెందిన రాంకురే గణేష్(38) మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో శనివారం రాత్రి కుటుంబసభ్యులతో గొడవపడి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దేవరకొండ పట్టణంలో
దేవరకొండ, సెప్టెంబర్ 29: నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణ ంలో ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణంలోని ఏఎమ్మార్వో కాలనీకి చెందిన చెందిన కంచర్ల తిరుపతయ్య(42) ఆదివారం తెల్లవారుజామున జడ్పీ పాఠశాల వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలే దు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.