calender_icon.png 1 March, 2025 | 8:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిషనరేట్ కు మూడు పోలీస్ జాగిలాలు...

01-03-2025 06:02:56 PM

నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం...

పోలీస్ కమీషనర్ శ్రీనివాసులు..

మంచిర్యాల (విజయక్రాంతి): నేరాల నియంత్రణలో, నార్కోటిక్, ఎక్స్ ప్లోసివ్ గుర్తింపులో పోలీస్ జాగీలాల పాత్ర కీలకమని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాసులు అన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ పొందిన 24వ బ్యాచ్‌కి చెందిన జాగిలాలు పాసింగ్ అవుట్ పరెడ్ పూర్తి చేసుకొని మూడు జాగిలాలు వచ్చాయన్నారు. ఇవి నార్కౌటిక్ డాగ్ (జెస్సి) గంజాయి, మత్తు పదార్థాల గుర్తింపులో, స్నిపర్ డాగ్ (రైడర్) ఎక్స్ ప్లోజివ్ గుర్తింపులో, ట్రాకర్ డాగ్ (టైసన్) వివిధ రకాల నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించడంలో ఏడాది శిక్షణ పొంది కమిషనరేట్ కు వచ్చాయన్నారు.

నేరాల నియంత్రణలో పోలీసులకు జాగిలాలు ఎంతో సహకరిస్తాయని, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరం జరిగిన చోట పరిసరాల్లో వాసన చూసి నిందితులు, అనుమానితులను, నేరస్తులను త్వరగా గుర్తించడానికి జాగిలాలను ఉపయోగించడం జరుగుతుందన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పట్టుకోవడంలో, ఎక్స్ ప్లోసివ్ బాంబ్స్ ను గుర్తించిన విధంగానే డ్రగ్స్, గంజాయిని ట్రేస్ చేసేందుకు ఈ నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ కీలక పాత్ర ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సి రాజు, ఏఆర్ ఏసిపి ప్రతాప్, ఆర్ ఐలు వామనమూర్తి, శ్రీనివాస్, మల్లేశం, సంపత్, సిసి హరిష్ తదితరులు పాల్గొన్నారు.