calender_icon.png 27 October, 2024 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణహితలో ముగ్గురు గల్లంతు

27-10-2024 01:11:55 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సరదాగా ఈతకు వెళ్లి ప్రాణహిత నదిలో ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటన బెజ్జుర్ మండలం సోమినిలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జుర్‌కు చెందిన జహర్ హుస్సేన్ (24), ఇర్షాద్ (20), మొహిసీద్ (22)తో పాటు మరో ఇద్దరు సరదాగా ఈత కొట్టేందుకు ప్రాణహిత నదికి వెళ్లారు. వీరిలో నదిలోకి దిగి జహర్ హుస్సేన్, ఇర్షాద్, మొహిసీద్ గల్లంతయ్యారు. మిగిలినవారు కేకలు వేయగా స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు గజ ఈతగాళ్లతో గాంలిపు చర్యలు చేపడుతున్నారు.