21-02-2025 12:58:52 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): పంట పొలంలో తెగిపడిన విద్యుత్ తీగలకు తగిలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెం విషాద ఘటన నిజామాబాద్ జి బోధన్ డివిజన్లోని సాటాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్కు చెందిన వోర్సు గంగారం, భార్య ఓర్సు బాలమణి, కొడుకు ఓర్సు కిషన్ పెగడపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో అడవి పందుల వేటకు వెళ్లారు. పొలం లో ఉన్న నీటిలో విద్యుత్ తీగలు తెగిపడి ఉన్నాయి. గమనించకుండా వెళ్ల డంతో షాక్కు గురై మృతి చెందారు.