నల్లగొండ, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : వరంగల్ -ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మూడోరోజు నామి నేషన్లు కొనసాగాయి. బుధవారం ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన బంకరాజు స్వతంత్ర అభ్యర్థిగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు. నల్లగొండకు చెందిన పన్నాల గోపాల్రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జే. శ్రీనివాస్ ఉన్నారు.