ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో ఎన్కౌంటర్
రాయ్పూర్, సెప్టెంబర్ 23: ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అడవుల్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృ తిచెందారు. వీరిలో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలం నుంచి మృతదేహాలతో పాటు ఒక ఏకే ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్న తెలిపారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.